టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి ఫైర్‌

పేదల కోసం నిధులు ఖర్చుపెట్టలేదని విమర్శలు

revanth reddy
revanth reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపి రేవత్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వినాశకాలే విపరీత బుద్ధి… రాష్ట్రంలో కరోనా విధ్వంసం సృష్టిస్తుంటే పేదల కోసం నిధులు ఖర్చు చేయలేదు కానీ, సోకుల కోసం సచివాలయానికి వందల కోట్లా? అంటూ ప్రశ్నించారు. కాగా, సచివాలయ కూల్చివేతను పరిశీలించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద విచారణకు స్వీకరించింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ కానీ, సోమవారం కానీ విచారణ జరగొచ్చని భావిస్తున్నారు. సచివాలయం జి బ్లాక్ లో గుప్తనిధులపై ఆరోపణలు చేస్తున్న రేవంత్, సచివాలయం కూల్చివేత సందర్భంగా అసలేం జరుగుతోందో తమకు పరిశీలించే అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/