ఖమ్మం జిల్లాలో అప్రమత్తమైన అధికారులు
ఖమ్మం: ఏపిలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపి-తెలంగాణ సరిహద్దు ప్రాంతమయిన ఖమ్మం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. చెక్పోస్టుల వద్ద భారీ నిఘాను పెంచారు. తెలంగాణ ప్రభుత్వం ఏపి, మహారాష్ట్ర ప్రాంతాలకు తెలంగాణ వాసులు వెళ్లడంపై నిషేదం విధించినప్పటికీ, ఏపి నుంచి కూడా ఎవరిని కూడా తెలంగాణలోకి వెళ్లేందుకు అనుమతించడం లేదు. జిల్లాలోని మేడిశెట్టి వారి పాలెం చెక్ పోస్ట్ వద్ద అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. చెక్పోస్ట్ల వద్ద పరిస్థితిని ఎప్పటికపుడు జిల్లా కలెక్టర్ ఆర్ వి కణ్ణన్ సమీక్షిస్తున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/