కెసిఆర్ అందరికి మంచి చెప్పి వెళ్లినట్లుగా ఉంది
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగాన్ని చూసి సిని నిర్మాత , నటుడు బండ్ల గణేష్ స్పందించాడు. కెసిఆర్ మీడియా సమావేశాన్ని నిర్వహించి ప్రజలకు పలు విషయాల గురించి వివరిస్తుంటే స్వయాన ఇంటికి వచ్చి అందరికి మంచి చెప్పి వెళినట్లు ఉంటుందని అన్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు ప్రెస్మీట్ పెడితే ఆయన స్వయానా ఇంటికి వచ్చి అందరికి మంచి చెప్పి వెళ్లినట్లు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/