అధికారులను తప్పుదోవ పట్టించారు: సంజయ్
కేంద్రహోంశాఖకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఫిర్యాదు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికి హైదరాబాద్లో మాత్రం కేసుల సంఖ్య తగ్గడం లేదు. కరోనా నేపథ్యంలో గత నెల 25 నుండి ఈ నెల 2 వరకు కేంద్ర బృందం ప్రర్యటించింది. వారం రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన ఈ బృందం సంతృప్తికరంగా నివేదిక ఇచ్చిందంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర బృంద అధికారులను తప్పుదోవ పట్టించారని కేంద్ర హోంశాఖ కు ఫిర్యాదు చేశాడు. సంజయ్ ఫిర్యాదుతో కేంద్రం మరో బృందాన్ని రాష్ట్రానికి పంపుతోంది. హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కు చెందిన జయంత్ దాస్, బెనర్జీ బృందం ఈ సారి పర్యటించనుంది. కాగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయిన కేసులలో అర్ధభాగం హైదరాబాద్ నగరంలోనే ఉండడం గమనార్హం.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/