అత్తాపూర్ లో పర్యటించిన సజ్జనార్

బంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాల సీజ్

Cyberabad CP Sajjanar
Cyberabad CP Sajjanar

హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) సజ్జనార్‌ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అత్తాపూర్‌ లో ఈరోజు పర్యటించారు. నిత్యావసరాల కొనుగోలు నిమిత్తం వాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్, ఆధార్ కార్డు వారి వద్ద ఉండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో సజ్జనార్ మాట్లాడుతూ, ఎటువంటి కారణం లేకుండా, అనుమతి లేకుండా వాహనాలతో రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. నిత్యావసరాల కొనుగోలు నిమిత్తం రోడ్లపైకి వచ్చే వారిని 3 కిలో మీటర్ల లోపే అనుమతిస్తామని చెప్పారు. పోలీసులు నిర్వహించే తనిఖీలకు వాహనదారులు సహకరించాలని కోరారు. రోడ్లపై తిరుగుతున్న వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/