16 నుండి పదో తరగతి పరీక్షలు

హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఈనెల 16 నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజ§్ు కుమర్ వెల్లడించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2,563 పరీక్షా కేంద్రాలు,144 ఫ్లయింగ్, 4 ప్రత్యేక స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పది పరీక్షలకు 5,52,302 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మార్చి 22న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున ఇంగ్లీష్2 పరీక్ష ఏప్రిల్ 3కు వాయిదా పడింది. హాల్ టికెట్లు అందని విద్యార్థులు బోర్డు వెబ్సైట్ http://tghtd.bsetelangana.org/ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
మరిన్ని తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/