ప్రభుత్వ చొరవతో పోలీసు వ్యవస్థ బలపడింది

హైదరాబాద్: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌ రెడ్డి, సీపీ అంజనీ కుమార్‌, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ చొరవతో పోలీసు వ్యవస్థ బలపడిందని డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. సీసీ కెమెరాలు, అధునాతన సాంకేతికత అందించిందన్నారు. ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు అవార్డులు అందిస్తున్నదని చెప్పారు.

పోలీసుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. పోలీసులకు జీతభత్యాలు, వాహనాలు సమకూర్చామని వెల్లడించారు. అత్యవసర స్పందన కోసం 11500 వాహనాలు అందించామన్నారు. రాష్ట్రంలో మొత్తం 8.25 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 7 లక్షలు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/