నిజామాబాద్లో కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్
నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ఈ రోజ ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమైంది.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు… నిజామాబాద్ కార్పొరేషన్ తోపాటు ఆరు మున్సిపాలిటీల్లో పోలింగ్ కొనసాగుతోంది.. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లు సంబంధిత స్లిప్పులను వెంట తీసుకు రావాలని అధికారులు తెలిపారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/