కెటిఆర్ను అర్థించిన టెకీ యువతి
యువతి ట్వీట్కు స్పందించిన మంత్రి..సాయం చేస్తానని హామీ
హైదరాబాద్: బీహార్లో కిడ్నాపైన తన తల్లిని రక్షించాలంటూ హైటెక్ సిటీలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఒకరు ట్విట్టర్ ద్వారా మంత్రి కెటిఆర్ను కోరారు. స్పందించిన కెటిఆర్.. ఆమె సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్, హైటెక్ సిటీలో గరిమ అనే యువతి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లా రక్షాహులో ఆమె తల్లిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. విషయం తెలిసిన ఆమె వెంటనే ఐటీ మంత్రి కెటిఆర్ సాయం అర్థించింది. ఆమె ట్వీట్కు స్పందించిన కెటిఆర్. . బీహార్ డీజీపీని సంప్రదించి విషయం తెలియజేశారు. గరిమ తల్లి ఆచూకీ కనుగొని, రక్షించాలని కోరారు. మీ తల్లి క్షేమంగా తిరిగి వస్తారంటూ గరిమకు భరోసా ఇచ్చారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/