శ్మశాన వాటికలో హరీశ్‌ రావు ఆకస్మిక తనిఖీ

Minister Harish rao
Minister Harish rao

సిద్ధిపేట: తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు శ్మశానవాటికను ఆకస్మికంగా పర్యటించారు. సిద్దిపేటలోని శ్రీ రామకుంట్ల శ్మశానవాటికను ఆకస్మికంగా పరిశీలించారు. శ్మశానవాటికలో పలు అభివృద్ధి పనులు‌చేపట్టాలని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఎక్కడ కూడా చెత్త, పిచ్చి మొక్కలు గాని కనపడకూడదని చెప్పారు. పిడకలు, కర్పూరం, నెయ్యి వంటి వాటితో అంత్యక్రియలు జరిపేలా ప్రోత్సహించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్ నగరంలోని మహాప్రస్థానం ఇతర ప్రాంతాల్లోని స్మశాన వాటికలు వాటి నిర్వహణ ఎలా ఉన్నాయో తెలుసుకొని, వాటికి భిన్నంగా సిద్ధిపేట శ్రీరామ కుంట్ల స్మశాన వాటికను తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/