కొత్త రెవెన్యూ బిల్లుకు శాసనమండలి ఆమోదం

telangana-legislative

హైదరాబాద్‌: కొత్త రెవెన్యూ బిల్లుకు శాస‌న‌మండ‌లి ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ బిల్లును సిఎం కెసిఆర్‌ ఈరోజు మండ‌లిలో ప్ర‌వేశ‌పెట్టి చ‌ర్చ‌ను ప్రారంభించారు. స‌భ్యులు లేవ‌నెత్తిన సందేహాల‌కు సీఎం కేసీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు. అనంత‌రం ఈ బిల్లును ఆమోదిస్తున్న‌ట్లు మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్ర‌క‌టించారు. నూత‌న రెవెన్యూ బిల్లుతో పాటు వీఆర్వో పోస్టుల ర‌ద్దు బిల్లుకు, తెలంగాణ మున్సిప‌ల్ నిబంధ‌ణ స‌వ‌ర‌ణ బిల్లుకు, తెలంగాణ పంచాయ‌తీరాజ్ స‌వ‌ర‌ణ బిల్లుకు మండ‌లి ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంత‌రం మండ‌లిని మంగ‌ళ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్ర‌క‌టించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/