పోడు భూముల పై హైకోర్టులో విచారణ..సర్కార్ కు నోటీసులు

హైదరాబాద్: తెలంగాణలో పోడు భూములపై దాఖలైన పిటిషన్ ను గురువారం హైకోర్టులో విచారించింది. వేలాది మంది ఆది వాసులను అడవి నుండి వెల్లగొట్టడాన్ని సవాలు చేస్తూ చెరుకు సుధాకర్, పిల్ విశ్వేశ్వర్ రావు, అదివాసి పోరాట సమితి నేత శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ విచారించారు. ఈ పిటిషన్‌కు సంబంధించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు… తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/