సీఎం జగన్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: సీఎం జగన్ కి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జగన్పై 11 చార్జ్షీట్లు ఉన్నాయని రఘురామ తరఫున న్యాయవాది కోర్టుకి తెలిపారు. బెయిల్ రద్దు చేసి 11 చార్జ్ షీట్లను విచారించాలని కోరారు. దీంతో హైకోర్టు బెయిల్ రద్దు పిటిషన్పై ఏపీ సీఎం జగన్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/