న్యూఇయర్‌ వేడుకలను ఎలా అనుమతించారు?..హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

Telangana High Court
Telangana High Court

హైదరాబాద్‌: హైకోర్టులో గురువారం కరోనా సంబంధిత వ్యాజ్యాలపై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. న్యూఇయర్ వేడుకలను బ్యాన్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త కరోనా వైరస్ ప్రమాదకరమని ఓ వైపు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న వేడుకలను ఎలా అనుమతిస్తారని మండిపడింది.

విచ్చలవిడిగా వైన్ షాపులు, బార్లు తెరవడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకుని హైకోర్టు ఈ అంశంపై విచారణ జరిపింది. వేడుకలను బయట జరుపుకోవద్దని ప్రజలకు సూచించామని ఈ సందర్భంగా కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. దీంతో, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. జనవరి 7న పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వేడుకలను నిషేధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/