సిఎం జగన్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ
హైదరాబాద్: ఏపి సిఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ వేసిన పిటిషన్పై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సిబిఐ కేసుల్లో తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ సిఎం జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ పిటిషన్లపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐను న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. వచ్చే శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది కోరారు. హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయాన్ని సిబిఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని న్యాయస్థానం సూచించింది. కాగా సిబిఐ కోర్టుకు జగన్ వ్యక్తిగత మినహాయింపు పిటిషన్ ను సిబిఐ కోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టును జగన్ ఆశ్రయించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/