తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది జిల్లాల కలెక్టర్లు సహా 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా జితిష్ వి పాటిల్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా కే నిఖిల, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా పి ఉదయ్ కుమార్, జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ గా వల్లూరు క్రాంతి, జనగామ జిల్లా కలెక్టర్ గా సీ హెచ్ శివలింగయ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ గా బీ గోపి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా కే శశాంక నియమించింది.

అలాగే వ్యవసాయ శాఖ కార్యదర్శిగా రఘునందన్‌రావు, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ కార్యదర్శిగా అనితా రామచంద్రన్‌, మైనారిటీ సంక్షేమ కార్యదర్శిగా అబ్దుల్‌ అజీం, పంచాయతీరాజ్‌ కమిషనర్‌గా శరత్‌, పరిశ్రమలశాఖ సంచాలకునిగా కృష్ణభాస్కర్‌, యువజన సర్వీసుల సంచాలకునిగా వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.