తెలంగాణాలో 4 కోట్ల మార్కును దాటిన టీకా పంపిణీ

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ మరో మైలురాయిని అధిగమించింది. గురువారం ఉదయం వరకు కరోనా వ్యాక్సినేషన్‌ 4 కోట్ల మార్కును దాటింది. ఇప్పటివరకు అర్హులైన 95 శాతం మందికి మొదటి డోసు పంపిణీ చేశారు. రెండో డోసు 50 శాతం పూర్తయిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమయింది. అప్పటి నుంచి 165 రోజుల్లో కోటి డోసులను పంపిణీ చేశారు. వ్యాక్సినేషన్‌ మరో 78 రోజుల్లోనే రెండు కోట్ల మార్కును చేరింది. ఇక కేవలం 27 రోజుల్లోనే అంటే అక్టోబర్‌ 23 నాటికి మరో కోటి డోసుల వ్యాక్సిన్లను పంపిణీ చేశారు. నాలుగు కోట్ల మైళురాయిని దాటడానికి మరో 45 రోజుల సమయం పట్టింది. కాగా, అర్హులైనవారిలో ఇప్పటివరకు 18 లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకోలేదని సమాచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/