టిఆర్‌ఎస్‌ నేతలపై రేవంత్‌ రెడ్డి విమర్శలు

Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ నేతలకు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది. 2017, ఏప్రిల్‌ 27న
టిఆర్‌ఎస్‌ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ నేతలు వరంగల్‌ ప్రగతి నివేదన సభ కోసం కార్యకర్తల దారి ఖర్చులకు గులాబీ కూలీ పేరిట ఆ పనులు చేశారు. అయితే అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అధికారాన్ని దుర్వినియోగం చేశారని గతంలో కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. చట్టాలను ఉల్లంఘించారని ఆయన ఫిర్యాదు చేసి, కోర్టుకు వెళ్లారు. ఈ కారణంగానే టిఆర్‌ఎస్‌ నేతలకు ఐటీ నోటీసులు అందినట్లు సమాచారం. నోటీసులు అందుకున్న వారిలో పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధిచిన వార్తను పోస్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘పగులుతున్న పాపాల (ముఠా) పుట్ట’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/