సిఎం కెసిఆర్ ఇంట్లో అలుముకున్న విషాదం
సిరిసిల్ల: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిఎం సోదరి భర్త ఇవాళ అనారోగ్యంతో కన్నుమూశారు. రాజన్న సిరిసిల్లకు చెందిన పర్వతనేని రాజేశ్వర్ రావు (84) అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన మరణించారు. విషయం తెలుసుకున్న మంత్రులు కెటిఆర్, హరీశ్ రావులు రాజేశ్వర్ రావు కుటంబ సభ్యులను పరామర్శించారు. ఆయన పార్థీవదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. సిఎం కెసిఆర్ తల్లిదండ్రుల స్వగ్రామం మెదక్ జిల్లా చింతమడక. ఆయనకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. అప్పటి ఎగువ మానేరు ప్రాజెక్టులో వారి భూమి కోల్పోయిన కారణంగా చింతమడక గ్రామానికి వచ్చి వారు స్థిరపడ్డారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/