నేడు టిఆర్ఎస్ ఎంపిలతో సిఎం సమావేశం
హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఇవాళ టిఆర్ఎస్కు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులతో మధ్యాహ్నం ప్రగతి భవన్లోసమావేశం కానున్నారు. సెప్టెంబరు 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో.. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కరోనా లాక్డౌన్ కేంద్రం ప్రభుత్వం అనురిస్తున్న తీరుపై ఎంపిలతో చర్చించి.. సభలో ఎలా వ్యవహరించాలన్న దానిపై దిశా నిర్దేశం చేయనున్నారు సిఎం కెసిఆర్. జీఎస్టీ విషయంలో కేంద్రం వైఖరి, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలతో పాటు ఇతర అంశాలపైనా చర్చించనున్నారు.
కాగా ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/