నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం

లాక్ డౌన్ పై కీలక నిర్ణయం వెలువరించే అవకాశం

హైదరాబాద్: నేడు సీఎం కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కానున్నది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. భేటీలో లాక్‌డౌన్‌, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత సీజనల్‌ అంశాలు, గోదావరి నుంచి నీటిని ఎత్తిపోత, జలవిద్యుత్‌ ఉత్పత్తి తదితర అంశాలపై చర్చించనున్నారు. కరోనా కట్టడికి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించటంతో ప్రస్తుతం కొత్త కేసులు చాలావరకు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో శనివారం వరకు ఉన్న లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలా? లేదా మరిన్ని సడలింపులు ఇవ్వాలా అనేఅంశపై క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోనున్నది. కరోనా మూడో వేవ్‌ గురించి వస్తున్న సమాచారాన్ని కూడా మంత్రివర్గభేటీలో చర్చించే అవకాశం ఉన్నది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/