ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్: సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొత్త సచివాలయం నిర్మాణం, నియంత్రిత సాగు, కరోనా కట్టడి చర్యలు, కొవిడ్ నేపథ్యంలో విద్యారంగానికి సంబంధించిన అంశాలు, కృష్ణా జలాల అంశం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ, రిటైల్ ట్రేడ్, లాజిస్టిక్ పాలసీపై చర్చిస్తున్నారు. సమావేశానికి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/