అందుకే సిఏఏకు సిఎం కెసిఆర్ వ్యతిరేకత
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నది ఎంఐఎం అధినేత అసదుద్దీన్తో మిత్రుత్వం కోసమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఈ రోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఏఏను అడ్డుకోవడం అంటే పాకిస్థాని ముస్లింలకు మనదేశ పౌరసత్వం కోరడమేనని అన్నారు. అలాంటిది సిఎం కెసిఆర్ దానిని వ్యతిరేకిస్తున్నాడంటే అది కేవలం ఎంఐఎంతో దోస్తీ కోసమేనని ఆయన విమర్శించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కెసిఆర్కు తగిన బుద్ధి చెప్పారని లక్ష్మణ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భైంసాలో టిఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని విమర్శించారు. బిజెపి కార్యకర్తలపై టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలే బిజెపి పెద్ద బలమని ఆయన అన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/