కెటిఆర్ ఆ సంగతి గుర్తించాలి
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ హితవు
హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ టిఆర్ఎస్ అధినాయకత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కెసిఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పటికంటే, గత ఆరు సంవత్సరాల్లో కేంద్రం ఏడు రెట్ల నిధులు ఇచ్చిందని వెల్లడించారు. నిజాయతీ ఉంటే దీనిపై కెటిఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తెలంగాణకు కేంద్రం బడ్జెట్ లో నిధులు ఇవ్వలేదని కెటిఆర్ వ్యాఖ్యానించడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉండవన్న సంగతి కేటీఆర్ గుర్తించాలని హితవు పలికారు. మీ జేబులు నింపుకోవడానికి కేంద్రం నిధులు కేటాయించదన్న విషయాన్ని గ్రహించాలని కెటిఆర్ పై ధ్వజమెత్తారు. కెటిఆర్ గల్లీ మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/