ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి.శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి లు సమావేశాలకు అధ్యక్షత వహించారు. ఉభయ సభల్లో నేడు ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదులు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టి ఆమోదించనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టారు. విప్ ప్రభాకర్ తీర్మానాన్ని బలపరిచారు. శాసనసభలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే వివేకానంద తీర్మానాన్ని బలపరిచారు. ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/