తెలంగాణ లో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించిన బిజెపి

తెలంగాణ లో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది బిజెపి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ లో కాషాయం జెండా ఎగురవేయాలని చూస్తున్న బిజెపి..అందులో భాగంగా ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. గురువారం రోజున నాగోల్ లో జరిగిన బీసీ మోర్చా సభలో బీసీ డిక్లరేషన్ ను రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రవేశపెట్టగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆమోదించారు.

అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కోరల్లేని బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించి అన్ని అధికారాలు అప్పగిస్తామని పేర్కొంది. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే బీసీ విద్యార్థులందరికీ పరిమితి లేకుండా స్టాచ్చురేషన్ పద్దతిలో అందరికీ ఆర్దిక సాయం అందిస్తామని ప్రకటించింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్ద పీట వేస్తామని, ఎన్నికల్లో పోటీపడలేని, గెలవలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసారు.

ఎన్నికల్లో పోటీపడలేని, గెలవలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సహా బీసీ ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు.