తండ్రైన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్

భగవంతుడు గొప్ప గిఫ్ట్ ను పంపించాడన్న తేజస్వి

tejashwi-yadav-welcomes-first-child

పాట్నాః ఆర్జేడీ అధినేత, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ తొలిసారి తండ్రయ్యారు. ఆయన భార్య రాజశ్రీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన వార్తను తేజస్వీ యాదవ్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.

తమకు కూతురు రూపంలో భగవంతుడు గొప్ప గిఫ్ట్ ను పంపించాడని తేజస్వి అన్నారు. ఈ తెల్లవారుజామున రాచెల్ కు డెలివరీ అయింది. తేజస్వి వివాహం 2021 డిసెంబర్ 9న వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ఢిల్లీలోని ఆర్కే పురంలోని డీపీఎస్ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఇంట్లో వాళ్లను ఒప్పించి తన స్నేహితురాలిని తేజస్వి పెళ్లి చేసుకున్నారు. తండ్రి అయిన తేజస్వికి అరవింద్ కేజ్రీవాల్ తదితర నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు.