తీన్మార్ మల్లన్న అరెస్ట్

జర్నలిస్ట్​, క్యూ న్యూస్ అధినేత తీన్మార్​ మల్లన్న ( చింతపండు నవీన్)ను హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేసారు. మల్లన్న తనను డబ్బుల కోసం బ్లాక్​ మెయిల్​ చేశాడని జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్​శర్మ చేసిన ఫిర్యాదు మేరకు మల్లన్న ను అరెస్ట్ చేయడం జరిగింది. తనను రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ..ఇవ్వకపోతే తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేసి తన పేరును దెబ్బతీస్తానని బెదిరించినట్లు లక్ష్మీకాంత్ శర్మ పిర్యాదు లో పేర్కొన్నారు.

గత కొద్దీ రోజులుగా మల్లన్న పై వరుసగా ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఆయన టీం నుంచి కొందరు సభ్యులు బయటకు వచ్చి మల్లన్నపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనో పెద్ద బ్లాక్ మెయిలర్ అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరి ఆరోపణలు చేయడం జరిగింది. అయితే.. ఇదంతా తన టీం ను బలహీనం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అంటూ మల్లన్న ఆ ఆరోపణలను కొట్టి పారేశారు.