రాబోయే ఎన్నికల్లో 175కు 175 స్థానాలను టీడీపీ గెలవబోతుంది – అచ్చెన్నాయుడు

TDP AP president Atchannaidu

రాబోయే ఎన్నికల్లో 175కు 175 స్థానాలను టీడీపీ గెలవబోతుందని జోస్యం చెప్పారు అచ్చెన్నాయుడు. చంద్రబాబు కుప్పం పర్యటనలో చోటుచేసుకున్న పరిణామాలపై అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. చంద్రబాబుని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అన్న క్యాంటిన్ పెడుతుంటే దాన్ని వైస్సార్సీపీ మూకలు ధ్వంసం చేశారన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేస్తే జగన్ పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు.

జగన్‌కు పిచ్చి ముదిరి, పరాకాష్ఠకు చేరిందన్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ లేకుండా అల్లకల్లోలం సృష్టిస్తున్నారని, పర్యటనను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు వేస్తే ఒక రేటు.. దాడి చేస్తే ఒక రేటు ఇచ్చి వైస్సార్సీపీ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారన్నారు. జడ్ ఫ్లస్ భద్రతలో ఉండే చంద్రబాబును ఈ విధంగా చేయడమేంటని ప్రశ్నించారు. జగన్ ఓ దుర్మార్గుడు, ఫ్యాక్షనిస్ట్.. రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నా.. టీడీపీ తిప్పికొడుతోందని అచ్చెన్నాయుడు అన్నారు.