ఎన్నికల అధికారుల స్వామిభక్తి పారాయణం
స్థానికసంస్థల ఎన్నికలలో అధికార పార్టీ అరాచకం..వర్ల రామయ్య
అమరావతి: టిడిపి నేత వర్ల రామయ్య ఏపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సిపి నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు. అయినప్పటికీ వారి చర్యలను తమ పార్టీ అడ్డుకుని నిలబడిందని ఆయన చెప్పారు.
‘రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ అరాచకం, ఎన్నికల అధికారుల స్వామి భక్తి పారాయణం, కొందరు పొలీసు అధికారుల బరితెగింపు కలిపినా అధికార పార్టీకి 90 శాతం గ్రామ పంచాయతీల గెలుపు సాధ్యం కాలేదు. తెలుగుదేశం పోరాటానికి అధికారపార్టీ సాష్టాంగ పడింది. అరాచకాన్ని టిడిపి కట్టడి చేయగలిగింది’ అని వర్ల రామయ్య తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/