టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య దంప‌తులు దీక్ష

చంద్ర‌బాబు కుటుంబానికి సీఎం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్

విజయవాడ: టీడీపీ నేత వర్ల రామయ్య త‌న భార్య‌తో క‌లిసి దీక్ష చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి కుటుంబాన్ని ఇటీవ‌ల‌ అసెంబ్లీలో కించపర్చినందుకుగాను ఈ దీక్ష చేస్తున్న‌ట్లు వ‌ర్ల రామ‌య్య తెలిపారు. ఈ రోజు ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఆయ‌న ఇంట్లో ప్రారంభ‌మైన ఈ దీక్ష ఈ రోజు రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

వైస్సార్సీపీ నేతలు రోజు రోజుకీ రెచ్చిపోతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. చంద్ర‌బాబు నాయుడి కుటుంబానికి సీఎం జ‌గ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. వ‌ర్ల రామ‌య్య దంప‌తుల దీక్ష‌కు ప‌లువురు టీడీపీ నేత‌లు మద్ద‌తు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/