ఉత్తరాంధ్ర సమస్యలపై నిరసనకు సిద్దమైన టిడిపి

28 నుంచి ఉత్తరాంధ్ర సమస్యలపై టిడిపి పోరు బాట

MLC Budda Venkanna
Buddha Venkanna

అమరావతి : టిడిపి ఉత్తరాంధ్ర సమస్యలపై పోరుకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన తెలియజేయనుంది. ఈ మేరకు పార్టీ ఉత్తరాంధ్ర టిడిపి ఇన్‌చార్జ్ బుద్ధా వెంకన్న తెలిపారు. నిరసనలు తెలియజేసేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ కమిటీల్లో సీనియర్ నాయకులు పూసపాటి అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనందబాబు, కిమిడి కళావెంకటరావుతోపాటు ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాల నాయకులు ఉంటారని వెంకన్న తెలిపారు.

కాగా , ఈ నెల 28న టిడిపి నాయకుల బృందం రుషికొండపై విధ్వంసాన్ని పరిశీలించి నిరసన తెలుపుతుంది.

  • 29న దసపల్లా భూముల వద్ద నిరసన
  • 30న ఏజెన్సీలో గంజాయి సాగు, అమ్మకాలకు వ్యతిరేకంగా అరకులోయలో నిరసన
  • 31న ఏజెన్సీలో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పాడేరులో నిరసన
  • నవంబరు 1న చక్కెర కర్మాగారాల మూసివేతకు వ్యతిరేకంగా అనకాపల్లిలో నిరసన కార్యక్రమం
  • నవంబరు 3న సాగునీటి ప్రాజెక్టుల నిర్వీర్యంపై హిరమండలం సమీపంలోని గొట్టా బ్యారేజ్ వద్ద నిరసన