ఈనెల 20, 23న టీడీపీ నిర‌స‌న‌లు : చంద్ర‌బాబు

అమరావతి: ఉచిత రిజిస్ట్రేషన్‌లు కోరుతూ ఈనెల 20, 23తేదీల్లో త‌మ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు వెల్లడించారు. ప్రైవేట్‌ లేఅవుట్లలో 5శాతం భూమి మధ్య తరగతికి పెనుభారమని ఆయన పేర్కొన్నారు. ఏపీలో రైతులు ఆందోళన చెందుతున్నారని రైతుల వద్ద ధాన్యం కొనేవారు కరువయ్యారని ఆయన అన్నారు. రూ. 2 లక్షల కోట్ల సంపదైన అమరావతిని నాశనం చేశారని విమర్శించారు. రైతులు ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం విక్రయిస్తుండటంతో బస్తాకు రూ.500 వరకు నష్టం వస్తోందని ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్‌ పేదల మెడకు ఉరితాడులా మారిందన్నారు. కక్ష సాధింపు కోసమే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌పై బురద జల్లుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రేమచంద్రారెడ్డి ఎండీగా ఉన్నప్పుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో చెల్లింపులు జరిగాయని ఆయన అన్నారు.

తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/