టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ : లోకేష్ వెల్లడి
అమరావతి: టీడీపీకి చెందిన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శుక్రవారం రాత్రి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి అసభ్యకరంగా మెసెజ్ లు వస్తున్నాయి. దీన్ని టీడీపీ ఐటీ విభాగం గుర్తించింది. అయితే ప్రస్తుతానికి ఎలాంటి నష్టం జరగలేదని టీడీపీ ఐటీ విభాగం ప్రకటించింది. టీడీపీ ట్విట్టర్ ఖాతాను తిరిగి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు టీడీపీ ఐటీ విభాగం తెలిపింది.
మరోవైపు తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను పురుద్ధరించేందుకు ట్విట్టర్ ఇండియాతో చర్చిస్తున్నట్టు నారా లోకేష్ తెలిపారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/