నువ్వు మునుపటి ఉత్సాహంతో తిరిగి రావాలి: లోకేశ్

తీవ్రంగా గాయపడిన హీరో సాయితేజ్
స్పందించిన నారా లోకేశ్ తదితరులు

అమరావతి: నిన్న హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగాహీరో సాయితేజ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సాయితేజ్ కోలుకుంటున్నాడని వైద్యులు తాజా బులెటిన్ లో తెలిపారు. కాగా, సాయితేజ్ క్షేమంగా ఉండాలంటూ అభిమానులు, సన్నిహితులు, ప్రముఖులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. సాయితేజ్ సత్వరమే కోలుకోవాలని, ఆరోగ్యవంతుడవ్వాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. “సాయితేజ్… నువ్వు మునుపటి ఉత్సాహం, తరగని శక్తితో తిరిగి రావాలని మేమందరం ప్రార్థిస్తున్నాం” అని ట్వీట్ చేశారు.

కాగా, సాయితేజ్ ను ప్రమాదం జరిగిన వెంటనే మాదాపూర్ లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/