విచారణ ఆలస్యానికి అనేక యత్నాలు
రకరకాల పిటిషన్లతో పదేళ్లు గడిపేశారని విమర్శలు
అమరావతి: అమరావతిని చంపేందుకు త్వరగా కోర్టులో విచారణ పూర్తిచేయాలని అడుగుతున్న సిఎం జగన్ లక్ష కోట్ల ప్రజాధనం దోచేసిన వ్యవహారంలో 11 కేసుల విచారణ త్వరగా పూర్తయ్యేందుకు సహకరించాలని టిడిపి నేత నారా లోకేశ్ హితవు పలికారు. జగన్ కోర్టుకు వెళ్లకుండా ఉండేందుకు, విచారణ ఆలస్యం అయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
కరోనా వైరస్ భయం వల్ల ఒకసారి, కోర్టుకు రావాలంటే రూ.60 లక్షలు అవుతుందని మరోసారి, ప్రతిపక్ష నేతగా ఉన్నాను కోర్టుకు రాలేనని గతంలో ఓసారి… ఇలా రకరకాల కారణాలతో విచారణ రాకుండా గడిపేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వాధినేతగా ఉన్నాను కోర్టు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారని మండిపడ్డారు. అనేక పిటిషన్లతో 10 ఏళ్లు గడిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 29 వేల మంది రైతుల కేసు కొన్నిరోజుల్లోనే తేలిపోవాలా? మీ లక్ష కోట్ల దోపిడీ కేసేమో ఏళ్ల తరబడి సాగాలా? అంటూ లోకేశ్ సీఎం జగన్ ను ప్రశ్నించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/