రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు, నిధులు గురించి కేంద్రాన్నిఅడగలేని స్థితిలో జగన్

tdp mp rammohan naidu comments on jagan

అమరావతి: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోని విలేకరులతో మాట్లాడుతూ..ఏపీ సీఎం జగన్‌కు పై కీలక వాక్యాలు చేశారు. ఇకపై ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కేంద్రాన్ని చూసి అయన మరింత భయపడతారని, గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయని తెలిపారు. ఈ ఫలితాల్లో బీజేపీ మరింత బలంగా మారిందని, రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు, నిధులు గురించి ఇకపై కేంద్రాన్ని అడగలేని బలహీనపరిస్థితిలోకి జగన్ వెళిపోతారని అన్నారు.

రామ్మోహన్ నాయుడు ఈ వాక్యాలు చేశారు. రామ్మోహన్ నాయుడు పార్లమెంటులో తమ బలం తక్కువగానే ఉన్నప్పటికీ రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని తెలిపారు. ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తుడడం వల్లే రాష్ట్రంలో బీజేపీ బలపడడం లేదని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఇకపై ప్రాంతీయ పార్టీలు బలహీనపడుతున్నాయన్ని వాదన సరికాదని అన్నాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/