ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు ఫై అసెంబ్లీ లో ఆందోళనకు దిగిన టీడీపీ

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు బిల్లును వెనక్కి తీసుకోవాలని ఏపీ అసెంబ్లీ లో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చేందుకు రాత్రికి రాత్రే ఆన్‌లైన్‌లో ఆమోదించిన కేబినెట్​. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్సార్​ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు చేస్తూ అసెంబ్లీ ని బిల్లు తీసుకొచ్చారు. దీంతో పేరు మార్పు బిల్లును వెనక్కి తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతు స్పీకర్ పోడియం పైకి ఎక్కి నినాదాలు చేసారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు టీడీపీ సభ్యులు. దీంతో ఏపీ అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసాయి.

ఈ తరుణంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులకు ఎన్టీఆర్ పేరును ప్రస్తావించే హక్కు లేదు…బుచ్చయ్య చౌదరి ఒక్కరికే ఎన్టీఆర్ పేరు ప్రస్తావించే హక్కు ఉందని వెల్లడించారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు ఇక్కడ ఉన్న సభ్యుల్లో బుచ్చయ్యచౌదరి ఒక్కరే ఎన్టీఆర్ పక్షాన నిలబడ్డారన్నారు. మిగిలిన వాళ్ళంతా వెన్నుపోటు దారులేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ చేయాలని అడుక్కున్న వ్యక్తి చంద్రబాబు అని…కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ చేసిన నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నీకు గతంలో ఎందుకు చేయలేకపోయావ్… చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలతో ప్రేమగా మాట్లాడటం నేర్చుకో అని ఆగ్రహం వ్యక్తం చేశారు.