ఏపి గవర్నర్, స్పీకర్కు టిడిపి శాసనసభా పక్షం లేఖ
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు సమావేశం
అమరావతి: టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. శాసన మండలి రద్దుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము ఎలా వ్యవహరించాలన్న విషయంపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలతో చర్చించి ఆయన కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు గవర్నర్, శాసనసభ స్పీకర్కు టిడిపి శాసనసభా పక్షం లేఖ రాసింది. సభల నిర్వహణలో బిఏసి అజెండాను ఉల్లంఘించారని ఫిర్యాదు చేసింది. మూడు రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలని బిఏసిలో నిర్ణయించారని తెలిపింది. బిఏసికి చెప్పకుండానే ఇష్టానుసారం సభను మరో మూడు రోజుల పాటు పొడిగించారని ఫిర్యాదు చేసింది. సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులపై అసెంబ్లీలో చర్చించడం నిబంధనలకు విరుద్ధమని చెప్పింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/