సాయంత్రం 4 గంటలకు టీడీపీ నేతలకు గవర్నర్​ అపాయింట్​ మెంట్​

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇంటి ఫై వైసీపీ నేతలు దాడి చేసారని ..టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో వారికీ ఈరోజు సాయంత్రం 4 గంటలు అపాయింట్​ మెంట్​ ఇచ్చారు. చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన దాడి ఫై పూర్తి సాక్ష్యాధారాలతో గవర్నర్ కు వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, ఆలపాటి రాజా, అశోక్ బాబులతో కూడిన టీడీపీ నేతల బృందం ఫిర్యాదు చేయనుంది.

మాజీ మంత్రి కోడెల శివ ప్రసాద్ సంస్మరణ సభలో అయ్యన్నపాత్రుడు చెత్త పాలన చేసే చెత్త నా … అని జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సహా పలువురు నేతలు చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వైసీపీ జెండాలు, కర్రలతో చంద్రబాబు ఇంటి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన వైసీపీ నేతలు చంద్రబాబుకు, టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకోవడంతో పాటు తోపులాటకు దిగారు. చంద్రబాబు ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను అదుపుచేయడానికి లాఠీఛార్జి చేశారు.