ఏపి ప్రభుత్వంపై లోకేశ్‌ విమర్శలు

ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొడుతుంటే నో సీఐడీ

nara lokesh
nara lokesh

అమరావతి: టిడిపి నేత నారా లోకేశ్‌ ఏపి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ‘పేదలకు అన్యాయం జరుగుతుంటే నో పోలీస్.. ఓ క్రిమినల్‌ని చంపితే మాత్రం పోలీసులు వస్తున్నారు’ అంటూ విమర్శించారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు అక్రమాలకు పాల్పడుతుంటే కనపడని సీఐడీ.. టిడిపి నేతలపై మాత్రం అక్రమ కేసులు పెడుతోందని లోకేశ్ ట్వీట్‌ చేశారు. ‘వైఎస్‌ఆర్‌సిపి మాఫియా ఇసుక కొట్టేస్తే నో సీఐడీ, ఇళ్ల స్థలాలు అమ్మతుంటే నో సీఐడీ, ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొడుతుంటే నో సీఐడీ, విషం కంటే ప్రమాదకరమైన మందు పోస్తూ వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేస్తుంటే నో సీఐడీ. 108లో స్కామ్ బయటపడితే నో సీఐడీ, మైన్స్ మింగేస్తుంటే నో సీఐడీ’ అని ట్వీట్ చేశారు.

‘మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడుతుంటే నో సీఐడీ. రాజారెడ్డి రాజ్యాంగంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ని సోషల్ మీడియా వేధింపుల డిపార్ట్మెంట్ గా మార్చేశారు వైఎస్ జగన్ గారు. భావ ప్రకటనా స్వేచ్ఛని హరించే హక్కు మీకు ఎవరిచ్చారు?’ అని అన్నారు. ‘ఏం నేరం చేశారని అర్థరాత్రి చొరబడి మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు? కృష్ణ, కిశోర్ గారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. జగన్ గారి చెత్త పాలన గురించి వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలే వివరిస్తున్నారు.. మరి వారిని కూడా సీఐడీ అరెస్ట్ చేస్తుందా?’ అని ప్రశ్నించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/