కృష్ణా జిల్లాలో పర్యటించనున్న లోకేశ్‌

విజయవాడ: టిడిపి నేత నారా లోకేశ్‌ ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య ఇంటిపై నందిగామ వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తల దాడిని ఖండిస్తూ లోకేష్ ఆమెను పరామర్శించనున్నారు. తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలం రామచంద్రాపురంలో వైఎస్‌ఆర్‌సిపి వర్గీయుల దాడిలో గాయపడిన టిడిపి మండల అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి దంపతులను పరామర్శిస్తారు. అనంతరం గొల్లమందల గ్రామంలో వైఎస్‌ఆర్‌సిపి నాయుకుల దాడిలో హత్యకు గురైన టిడిపి కార్యకర్త పాలకొల్లు సోమయ్య కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/