గుంటూరు జిల్లా లో టిడిపి నేత హత్య

రాజకీయ హత్య, లేక పాత కక్షలా దిశగా పోలీసులు దర్యాప్తు

Guntur: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపారు. చంద్రయ్య గ్రామ సెంటర్‌లో కూర్చుని ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హత్య అనంతరం ప్రత్యర్థులు అక్కడి నుంచి పరారయ్యారు. హతుడు చంద్రయ్య మాచర్ల టిడిపి ఇంచార్జి జూలకంటి బ్రహ్మ రెడ్డి అనుచరుడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య రాజకీయ కోణంలో జరిగిందా? పాత కక్షలు ఉన్నాయా? అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/