అమరావతి గ్రాఫిక్స్ కాదు..దేవినేని
ఎన్నికలకు ముందే ఏకగ్రీవంగా ప్రజా రాజధానిగా అమరావతి

అమరావతి: టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఏపి ప్రభుత్వంపై మండిపడ్డారు. అమరావతి గ్రాఫిక్స్ కాదని, ఇది నిజమైన రాజధాని అంటూ ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. రైతులు త్యాగం చేస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం కౌలు ఇవ్వట్లేదని విమర్శించారు. ‘ఎన్నికలకు ముందే ఏకగ్రీవంగా ప్రజా రాజధానిగా అమరావతి, సీఆర్డీఏ చట్టం నిర్ణయం జరిగింది. జీవో ఇచ్చి రెండు నెలలైనా 186 కోట్ల రైతుల కౌలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు చేతులు రావడంలేదు? రైతుల త్యాగంతో కూడిన భూమితో పాటు రెసిడెన్షియల్ ఫ్లాట్లు అమ్మడానికి మీకెవరు అధికారం ఇచ్చారు వైఎస్ జగన్ గారు’ అని దేవినేని ఉమ నిలదీశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/