అమరావతి రైతులకు దేశమంతా మద్ధతు

ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో అధికారులు వణికిపోతున్నారు

bonda umamaheswara rao
bonda umamaheswara rao

అమరావతి: మందడంలో రైతులు చేపట్టిన 24 గంటల దీక్షకు టిడిపి నేత బొండా ఉమా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..అమరావతి రైతులకు దేశమంతా మద్దతు పలుకుతున్నా ముఖ్యమంత్రి మనసు మారడం లేదని విమర్శించారు. మొదటి నుంచి అమరావతిని చంపేయాలన్న కక్ష్యపూరిత ధోరణితో సీఎం జగన్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో అధికారులు వణికి పోతున్నారన్నారు. ప్రజల ఆక్షాంక్షలను లెక్కచేయకుండా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తోందని బొండా ఉమా విమర్శించారు. ఒక రాజధానిని కట్టలేని వాళ్లు మూడు రాజధానులు ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/