ప్రజాగ్రహానికి వైఎస్‌ఆర్‌సిపి నేతలు కొట్టుకుపోతారుః రావి వెంకటేశ్వరరావు

నానికి కిడ్నీతో పాటు బ్రెయిన్ సర్జరీ కూడా జరిగినట్లుందని ఎద్దేవా

tdp-ex-mla-raavi-venkateswara-rao-fires-on-gudivada-mla-kodali-nani

అమరావతిః టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, వైఎస్‌ఆర్‌సిపి నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై తీవ్రంగా మండిపడ్డారు. కొడాలిపై పోటీకి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రావాల్సిన అవసరంలేదని తేల్చేశారు. చంద్రబాబు, లోకేశ్ వంటి పెద్ద లీడర్ల దాకా ఎందుకు దమ్ముంటే తనపై గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. మంగళవారం రావి వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడారు. గుడివాడలో టిడిపి తరఫున చంద్రబాబు, లోకేశ్ వచ్చి పోటీ చేసినా ఓడిస్తానని కొడాలి నాని ధీమా వ్యక్తం చేయడం తెలిసిందే. దీనిపై రావి స్పందించారు.

కొడాలి నానికి ఇటీవల కిడ్నీ ఆపరేషన్ తో పాటు బ్రెయిన్ సర్జరీ కూడా అయినట్లుందని రావి ఎద్దేవా చేశారు. ఒక్క చాన్స్ అన్న పిలుపుతో తొందరపడి ఇటువంటి నేతలను ఎన్నుకోవడం తమ ఖర్మ అని ప్రజలు ఛీదరించుకుంటున్నారని చెప్పారు. ఒక్క చాన్స్ అంటూ వచ్చిన జగన్ కు ఇదే చివరి చాన్స్ అని అన్నారు. అవినీతి, అక్రమాలతో సంపాదించిన సొమ్మును విచ్చలవిడిగా విరజిమ్మినా 2024లో కొడాలి నాని గెలవలేడని రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొడాలి లెక్కలు, వాటికి పక్కా ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/