ప్రజల పక్షాన నిలిస్తే అరెస్ట్‌ చేస్తారా?

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలిచిన దేవినేని ఉమాను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు అండగా నిలిస్తే దాడులు చేస్తారా? అని మండిపడ్డారు. దేవినేని ఉమాపై భౌతికదాడికి దిగుతానన్న కొడాలి నానిపై చర్యలు ఉండవా? అని నిలదీశారు. తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి వైస్‌ఆర్‌సిపి మంత్రి బరితెగించి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

నెల్లూరు జిల్లా ఎస్పీపై వైస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే నల్లపుపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. సిఎం ప్రోత్సాహంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని ఖాతరు చేయని క్రూర స్వభావి జగన్ అని విమర్శించారు. గొల్లపూడిలో అరెస్ట్ చేసిన ఉమాతో పాటు ఇతర నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/