బ్రేకింగ్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపు

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ వైస్సార్సీపీ కి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించారు. కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి… 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. దీని బట్టి చూస్తే అధికార పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ పడినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. మరి ఆ నలుగురు ఎవరు అనేది క్లారిటీ గా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం అయితే ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఓట్లు టీడీపీకి పడ్డాయని అంత మాట్లాడుకుంటున్నారు. టీడీపీకి ఓటు వేసిన మరో ఇద్దరు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. ఊహించని విధంగా అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.