టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌

Pawan kalyan
Pawan kalyan

Amaravati: అమరావతి రైతుల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో మూడు రాజధానులకు ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో జనసేన పార్టీ స్పందించింది.

‘‘ అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలోకి రావాలి. రాజధాని వికేంద్రీకరణ పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారు.

రైతు కన్నీరుపై రాజధాని నిర్మాణం వద్దని మొదట్నుంచీ చెబుతున్నా. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారు.

రాజధాని వికేంద్రీకరణపై న్యాయకోవిదులు, నిపుణులతో చర్చిస్తాం’’అని పవన్‌ అన్నారు. 

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/