టిడిపి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు

వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చాక 650 చోట్ల దాడులు జరిగాయి

nakka anand babu
nakka anand babu

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై టిడిపి నేత నక్కా ఆనందబాబు విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..హైకోర్టు వ్యాఖ్యలతోనైనా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని ఆయన సూచించారు. సుమారు 42 అంశాల్లో వైఎస్‌ఆర్‌సిపి సర్కారుకు న్యాయస్థానం అక్షింతలు వేసిందన్నారు. వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చాక 650 చోట్ల దాడులు జరిగాయని విమర్శించారు. టిడిపి నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆనందబాబు మండిపడ్డారు. అధికారం, పార్టీలు శాశ్వతం కాదని పోలీసులు తెలుసుకోవాలని సూచించారు. కఠినంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/